రాజమండ్రిలో దొంగల బీభత్సం.. ఫైనాన్స్ ఆఫీసులో చోరీ

by Disha Web Desk 16 |
రాజమండ్రిలో దొంగల బీభత్సం.. ఫైనాన్స్ ఆఫీసులో చోరీ
X

దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రిలో గురువారం అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. ఫైనాన్స్ కార్యాలయంలో చోరీకి పాల్పడుతున్నారు. పెద్ద మొత్తంలో నోట్ల కట్టల్ని ఎత్తుకెళ్లారు. ముందుగా బ్యాంకులోకి చొరబడిన ఇద్దరు దొంగలు బ్యాంకు లాకర్లు పగులగొట్టినట్లు తెలుస్తోంది. అనంతరం అందులోని డబ్బులను బ్యాగులో పెట్టుకుని తీసుకెళ్లారు. అనంతరం పరారయ్యారు.

ఈ దృశ్యాలు బ్యాంకులోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. శుక్రవారం ఉదయం బ్యాంకుకు వచ్చిన సిబ్బందికి చోరి జరిగిన విషయం తెలిసింది. దీంతో పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. స్థానిక సీసీ పుటేజులను పరిశీలించారు. దొంగను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని చెప్పారు. అయితే దొంగలు భారీగా డబ్బులు ఎత్తుకెళ్లినట్లు బ్యాంకు మేనేజర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed